07 ఏప్రిల్, 2017

ఆముక్తమాల్యదలో వసంత ఋతువర్ణన


వసంతఋతువు మొదలీరోజు నుంచి 😊 చక్కగా ఋతువర్ణన చేస్తూ ఓ వ్యాసం రాద్దామనుకున్నాను నేను.. కానీ ఏం రాసినా ఈ ఋతువులో ముందు శ్రీకృష్ణదేవరాయల వారిని తలుచుకోవడం భావ్యమనిపించింది.... ఋతువర్ణనలను ఎంత సహజంగా,, సుందరంగా చేశారో ఆయన తాను రాసిన " ఆముక్తమాల్యద " లో...

ముఖ్యంగా వసంతఋతువును ఎంత అందంగా వర్ణించారో చూడండి అందులో 

***************************************

"" ఆముక్త మాల్యద విరహ తాపం ఎక్కువైందని , దక్షిణాయణం నుంచి ఉత్తరాయణానికి 
చేరటంతో వసంతం ఆరంభమయింది .

ఆమె విరహ నిట్టుర్పుల వేడికి ఆగలేక సూర్యుడు చల్లగా ఉంటుందని హిమాలయం వద్ద ఉత్తరానికి మొగ్గాడట . విరహం అనే బాటసారికి దాహమైతే అగ్ని వెంట తడి కూడా వచ్చినట్లు మన్మధుడు దండెత్తి వస్తున్నాడని సూచించే అతని జెండాపై గల మీనం (చేప )తో పాటు మేషం (రాశి )కూడా వచ్చింది . హేమంతచలి యువతుల్ని కావలించింది .

వసంతుడు అనే ప్రియుడు ముందుకు వచ్చి వెచ్చదనం కల్పిస్తాడనే భావంతో హేమంతం చివరి ముద్దు పెట్టుకొని వెళ్లిందట . చలాకీ చంద్రుడు సూర్య కిరణాలంత వేడి పుట్టించి విరహుల్ని వేధిస్తున్నాడు .వసంతరుతువు అనే మంత్రిని , కొత్తగా పుట్టిన వసంతుని బొడ్డు కోసిన కొడవలిలాగా కోయిల కూత యువతీ యువకుల్ని విరహంతో కోస్తున్నాయి .

శివునికీ పార్వతీ దేవికీ ప్రణయం కల్పించటానికి మన్మధుడు వేసిన పూల బాణాల మొనలు విరిగి , చివుళ్ళుగా వేలుస్తున్నాయట. భూదేవి కడుపులోంచి పుట్టిన వృక్షములనే పిల్లలకు పాలపళ్ళు , దంతాలు మొలిచినట్లు లేత చిగుళ్ళు పువ్వులు , పిందెలు పుడుతున్నాయి . వనలక్ష్మి రాబోయే మాధవుని అలంకరించటానికి సింగారించుకొందిట .”

దేవత్వం సిద్ధిన్చినా , మధుపానం అనే దురభ్యాసాన్ని వదలని తుమ్మెదలను వెక్కిరిస్తూ , తనకు పంచత్వం రారాదని పంచమ స్వరంతో కోయిల కూస్తోంది . మాధవుడు మామిళ్ళకు , పూలను సృష్టించి ,పిందెలు గా మార్చి మన్మధునికి ఆయుధాలు ,సరఫరా చేస్తున్నాడట .దేవుడే శత్రువుకు మేలు చేస్తుంటే విరహ గ్రస్తులకు దిక్కు లేకుండా పోయిందట .

మధుమాసం అనే ఆవు పొదుగు నుండి పాలు కారు తున్నట్లు చంద్రుని వెన్నెలల తో భూలోకం తడిసి కమ్మని వాసనలనిస్తోంది .

తుమ్మెద బారులు మన్మధ బాణానికి నారిగా మారుతోందట . యువతుల చంద్ర బింబాల వంటి మొహాల కన్నా చనుదోయి కంటే మాకే ఎక్కువ యవ్వనం వుందని పద్మాలు విరగ బూసి నవ్వు తున్నాయట .

భృగుమహర్షి తన్నినా నవ్వేసిన విష్ణుమూర్తి వెంకటేశ్వరుడై పద్మాతిని పెళ్ళాడాడు . ఆమె సత్యభామగా మారింది . స్త్రీలందరికీ ఆ అంశ అంటించింది .ఏ స్త్రీ తన్నినా అశోకవృక్షం బంగారు పూలతో పూసినట్లు నవ్వు తోందట .

మాధవుడు రసాతలాన్ని మకరంద వర్షంతో , భూమిని పూలతో , ఆకాశాన్ని పుప్పొడితో జయించి త్రిలోక విక్రముడైనాదట . చిలకకు జామపళ్ళు మేతగా ఇచ్చిన వసంతుడు ప్రేయసీప్రియులకు పూలు పంచి , తుమ్మెదలకు తేనెలిచ్చి , వసంతలక్ష్మికి వెచ్చని కౌగిలి ఇచ్చి పక్షపాతం లేదని పించాడట ""

అద్భుతంగా ఉన్నాయి కదూ ఈ వర్ణనలు??

శుభోదయం 😊 

వసంతాగమన దిన శుభాకాంక్షలు 😊 😊 😊 

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి