28 జూన్, 2016

చలం " మైదానం " పుస్తకంపై నా అభిప్రాయం




గుడిపాటి వెంకటాచలం రాసిన " మైదానం " అనే పుస్తకం చదివాను నేనీమధ్య... నిజం చెప్పుకోవద్దూ..!! నాకేం నచ్చలేదు ఈ పుస్తకం. 

" ప్రేమలేఖలు, మ్యూజింగ్స్, మరి ముఖ్యంగా " స్త్రీ " లాంటి గొప్ప పుస్తకాలు రాసిన ఆ చలమేనా ఈ పుస్తకం రాసింది? " అనే ఆశ్చర్యం కలిగింది నాకు ఈ పుస్తకం చదివాక...!!!

అసలీపుస్తకం చదవకముందు ఎంత గొప్పగా ఊహించుకున్నాన్నో " చలం రచనల్లో ఇదో మాస్టర్ పీస్ " అని మావాళ్ళందరూ ఊదరగొట్టేసరికి.. పుస్తకం కొంటున్నప్పుడు తెల్లటి వెన్నెల సముద్రపు కెరటాలలో పరావర్తనం చెందే ఆ దృశ్యం ఆ అట్టపై ఉండడం చూసి , వెనుక ఉన్న ఆ ప్రకృతి వర్ణనలు చదివి ఎప్పుడెప్పుడు చదువుతానా ఈ పుస్తకాన్ని? అని తెగ ఉత్సాహపడిపోయాను నేను. కానీ నా ఉత్సాహాన్నంతా నీరుగార్చేశాడు చలం.

కధకానీ , కధనంకానీ , పాత్రల ప్రవర్తన కానీ ఏమీ నచ్చలేదు నాకు.. స్వేచ్చపేరిట విశృంఖలత్వాన్ని వివరించాడు చలం ఈ రచనలో. 

కధానాయకురాలు " రాజేశ్వరి "ది మహోదాత్తమైన ప్రేమగా మొదట వర్ణించినా అసలు తన ఆలోచనలలో తనకే ఓ స్పష్టత లేక ఏది తోస్తే ఆ పని చేసేసి తనని తాను ఆత్మవిమర్శ చేసుకోక సమాజంలో ఉన్న ఆదర్శాలను విమర్శిస్తూ వాటికన్నా తన ఈ ప్రవర్తన చాలా సమర్ధనీయం అని సంతృప్తి పడుతూ ఉంటుంది ఆ పాత్ర ఇందులో. ఒక్క ఈ పాత్రనే కాదు ,,ఇందులోని ఏ పాత్రైనా ఆలోచనలలో పరిపక్వత ఉన్న వ్యక్తుల్లా ఏమనిపించవు నిజానికి...


" మరెందుకు చలం ఇలాంటి పుస్తకాలు,కధలు రాసి అనవసరంగా తన పేరుని చెడగొట్టుకున్నాడు ? " అని అనిపించింది నాకు ఈ పుస్తకం చదివాక...

నా ఉద్దేశంలో ఇలాంటి భావాలు అప్పటి సమాజంపై,ఆ జనాలపై వదిలితే కనీసం వాళ్ళు ఇరిటేట్ అయ్యి ఆ ఇరిటేషన్లోంచైనా " అసలేది కరక్ట్ ? ఏది కాదు ? " అని తర్కించి ( " కనీసం ఆలోచించి " అని అనవచ్చా? ) తాను చెప్పిన విషయాల్లో కొంతశాతం అయినా వాస్తవం గ్రహించి ఆచరిస్తారనే ఉద్దేశంతో రాశారేమో చలంగారు తన రాతలన్నీ ఇలా.....!!!!!!

ఏమంటారు?

- Kks Kiran
  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి