19 సెప్టెంబర్, 2019

వైకుంఠ పెరుమాళ్ దేవాలయం , కాంచీపురం 🙏

కంచిలో ఉన్న ప్రాచీనమైన ఆలయాలలో ప్రసిద్ధమైనది ఈ " వైకుంఠ పెరుమాళ్ దేవాలయం "

పల్లవ రాజులచే ఆరవ శతాబ్దంలో నిర్మింపబడిన ఈ ఆలయం వైష్ణవులు పరమ పవిత్రంగా భావించే 108 దివ్య క్షేత్రాలలో ఒకటి.. ఈ ఆలయంలో మొత్తం మూడు అంతస్తులున్నాయి

మొదటి అంతస్తులో విష్ణువు కూర్చున్న భంగిమలో ఉండగా , రెండవ అంతస్తులో నుంచుని ఉన్నట్లుగా , ఆ పై అంతస్తులో శయన రూపంలో దర్శనమిస్తున్నట్లుగా విగ్రహాలు రూపుదిద్దబడ్డాయి

కాలము వల్లనైతేనేమి , సరైన నిర్వహణ లేకపోవడం వల్లనైతేనేమీ చాలావరకు ఈ ఆలయం , అందులోని శిల్పాలు బాగా పాడయ్యాయి

అందుచేతే ఈ ఆలయంలో కేవలం మొదటి అంతస్తులోని మూర్తినే మనం దర్శించుకునే అవకాశం ఉంది

- Kks Kiran
































1 కామెంట్‌: