10 అక్టోబర్, 2017

' అశ్వమేధము ' అనే నవలలో భౌద్ధమతంలోని లోపాలను వివరిస్తూ పుష్యమిత్రుని పాత్ర ద్వారా విశ్వనాధ సత్యనారాయణ గారు చెప్పించిన ఓ విశ్లేషణ ఇది

"" మహారాజు బౌద్ధుడు. వాని గుర్రపు వాడు బౌద్ధుడు. మహారాజు తన గుర్రపువానికి నెలజీతమును మించి యీయడు. మహారాజు కుమార్తెను గుర్రపు వాని కుమారునికిచ్చి పెళ్లి చేయునా? వారొక వేళ ప్రేమించినచో నిద్దరును లేచిపోవలెను. 


అందరూ సమానులని చెప్పెడి ఏ సంఘమునందయిన ఏ దేశమునందైనను బరిస్థితి ఇదియే . 


బేధమేమనగా వీడు భోజనము చేయుచుండగా వాడు చూడవచ్చును ,, వానిని పక్కన కూర్చుండపెట్టుకొని వీడు భోజనము చేయడు ... వాని లౌకికమైన మర్యాదకి అది లోటు ...


మతసంబంధముగా చేయుటకు అభ్యంతరం లేదని చెప్పుదురు... లౌకికమైన బేధముల చేత అట్లు చేయరు... చేసినచో మర్యాద నష్టము ,, వారి గొప్పదనం పోవును...


లోకమునందు ఆ గొప్పదనమెట్టిది? మనోనిర్మితమైనదే కదా?


మతవిషయకమైన భేదమూ మనో నిర్మితమైనదే ...


ఈ మనోనిర్మితమైన భేదము మత సంబంధమన్నచో ద్వేష్యమా? లౌకికములయిన ధనాధికారముల విషయమయినపుడు స్వీకార్యమా?? ""


దీనిపై మీ అభిప్రాయం ??

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి